Header Banner

యుద్ధంతో సర్వం కోల్పోయారు.. వాళ్లకు అండగా ఉండండి! ప్రపంచ దేశాలకు ట్రంప్ సంచలన పిలుపు!

  Sat May 17, 2025 08:03        Others

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. అలాగే ఇజ్రాయెల్- హమాస్ మధ్య ఏళ్లకుఏళ్లుగా యుద్ధం సాగుతూనే ఉంది. ఈ క్రమంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్- హమాస్ యుద్దం కారణంగా గాజాలోని ప్రజల పరిస్థితి దయనీయంగా మారిందని.. మానవతా దృక్పథంతో వారిని ఆదుకోవాలని అన్నారు. ఆ ప్రాంత ప్రజలకు అన్ని విధాల అండగా ఉండాలని ప్రపంచ దేశాలకు ట్రంప్ పిలుపునిచ్చారు.

 

యుద్ధం కారణంగా గాజాలోని అనేక మంది ప్రజలకు ఆహారం లేదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. "ఈ ప్రాంతంలో లక్షలాది మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికోసం నెల రోజుల్లో మంచి పనులు చేసేందుకు అమెరికా ప్రభుత్వం సిద్దమైంది. పాలస్తీనా ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. గాజాలోని ఎంతో మంది ప్రజలు ఆకలితో ఉన్నారు. త్వరలో వారికోసం మంచి చేస్తాం" అని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మానవతా దృక్పథంతో వారికి సాయం చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో వారందరికీ గుడ్ న్యూస్! చంద్రబాబు కీలక ఆదేశాలు! రూ.12,500 చొప్పున..

 

మరోవైపు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం(WFP).. ఇదే విషయంపై ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలోని ప్రజలు కరవుతో అల్లాడుతున్నారు. యుద్ధం మళ్లీ తీవ్రతరం కావడంతో బోర్డర్లు అన్నీ మూసేశారు. ఆహార నిల్వల కొరత ఉంది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు.. అని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం అక్కడి పరిస్థితిని వివరించింది. మార్చి 2 నుంచి ప్రపంచ దేశాల సాయం ఆగిపోయిందని.. అప్పటి నుంచి అక్కడి పిల్లలు పౌష్టికాహార లోపంతో ఉన్నారని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం పేర్కొంది. గాజాలో దాదాపు 4 లక్షల 70 వేల మంది క్రిటికల్ హంగర్ తో ఉన్నారని వివరించింది.

 

మరోవైపు దక్షిణ గాజాలోని ఖాన్‌ యూనిస్, దేర్‌ అల్‌బలా నగరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. గత రెండు రోజుల నుంచి జరిగిన ఈ దాడుల్లో 82 మంది మృతి చెందినట్లు సమాచారం. ఇక ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. గాజాపై ఇజ్రాయెల్‌ వరుస దాడులతో విరుచుకుపడుతోంది. ఇటీవల అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఒప్పందం కుదిరింది. కానీ మళ్లీ అక్కడి పరిస్థితి మొదటికి వచ్చినట్లు తెలుస్తోంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #WarCrisis #TrumpAppeal #GlobalSupport #StandWithVictims #HumanitarianCrisis